Breadcrumb
Live Updates
రెండో రోజు ముగిసిన ఆట.. మెరిసిన జడ్డూ
రెండో రోజు ముగిసిన ఆట.. మెరిసిన జడ్డూ
శ్రీలంక, టీమిండియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ధనుంజయ డిసిల్వా 1, చరిత్ అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా, బుమ్రా చెరొక వికెట్ తీశారు. ప్రస్తుతం లంక తొలి ఇన్నింగ్స్లో 466 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకముందు 6 వికెట్ల నష్టానికి 357 పరుగుల క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలిరోజు పూర్తి ఆధిపత్యం చూపించిన టీమిండియా రెండో రోజు ఆటలోనూ అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా 175 పరుగులు నాటౌట్తో రెండో రోజు హైలెట్గా నిలిచాడు. అశ్విన్ కూడా 61 పరుగులతో రాణించడం విశేషం.
టీమిండియా బౌలర్ల దెబ్బ.. లంక నాలుగో వికెట్ డౌన్
టీమిండియా బౌలర్ల దాటికి శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 1 పరుగు చేసిన ధనుంజయ డిసిల్వా అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో లంక 103 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగించడానికి మరో మూడు ఓవర్లు ఆడాల్సి ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన లంక
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాటింగ్లో తడబడుతుంది. 28 పరుగులు చేసిన కెప్టెన్ దిముత్ కరుణరత్నే జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 14, మాథ్యూస్ 9 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. లంక స్కోరు 48 పరుగుల వద్ద ఓపెనర్ తిరిమన్నే 17 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
12 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 26/0
శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో దిమిత్ కరుణరత్నే(15), తిరుమానే(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.
572/8 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 572/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా, పంత్ చెలరేగి ఆడాడు. పంత్ 96 పరుగులు సాదించగా.. జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 357 పరుగులతో రెండో రోజు ఆటను టీమిండియా ఆరంభించింది. ఇక శ్రీలంక బౌలర్లలో లక్మల్,ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు సాధించారు.
500 పరుగుల మార్క్ను దాటిన టీమిండియా
శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 500 పరుగుల మార్క్ను దాటింది. భారత బ్యాటర్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. 155 పరుగులతో జడేజా నాటౌట్గా ఉన్నాడు. 123 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 8 వికెట్ల నస్టానికి 525 పరుగులు చేసింది.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..
471 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జయంత్ యాదవ్(2) ఫెర్నాండో బౌలింగ్లో తిరుమానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 115 ఓవర్లు ముగిసేసరికి భారత్ 472 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, మహ్మద్ షమీ ఉన్నారు.
సెంచరీతో చెలరేగిన రవీంద్ర జడేజా
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో మెరిశాడు. 166 బంతుల్లో జడేజా 102 పరుగులు సాధించి నాటౌట్గా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. అశ్విన్ ఔట్
462 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన అశ్విన్.. లక్మల్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 110 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 462 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(99), జయాంత్ యాదవ్ ఉన్నారు.
107 ఓవర్లకు భారత్ స్కోర్: 447/6
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. 107 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(90), రవిచంద్రన్ అశ్విన్(55) పరుగులతో ఉన్నారు.
భారీ స్కోర్ దిశగా భారత్.. 98 ఓవర్లకు స్కోర్: 403/6
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 400 పరుగుల మార్క్ను దాటింది. 98 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(77),అశ్విన్(24) పరుగులతో ఉన్నారు.
రవీంద్ర జడేజా ఆర్ధ సెంచరీ.. భారత్ స్కోర్: 362/6
శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆర్ధ సెంచరీతో మెరిశాడు. 87 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50),అశ్విన్(10) పరుగులతో ఉన్నారు.
రెండో రోజు ఆట ప్రారంభం..
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్ట్ మొదటి రోజు 357 పరుగులతో పటిష్ట స్ధితిలో నిలిచిన భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. క్రీజులో రవీంద్ర జడేజా(45), రవిచంద్రన్ అశ్విన్(10) పరుగులతో ఉన్నారు.
Related News By Category
Related News By Tags
-
కొత్త బాధ్యతల్లో రహానే
భారత క్రికెట్పై తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్కు సిద్ధమయ్యాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు ఇటీవలే ముగింపు పలికిన అతడు.. ఇక నుంచి కామెంటేటర్గా త...
-
‘కెప్టెన్గా ఫెయిలైనా ఫిట్నెస్కు కొత్త అర్ధం చెప్పాడు’
టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో ఒక జట్టుగా ఉన్న ...
-
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. ...
-
ఆ ముగ్గురి నుంచి ఫోన్కాల్.. అందరికీ ఒకటే సమాధానం!
అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశీ టూర్లలో ఎక్కువగా రాణించిన రహానే సంతృప్తిగానే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. అయ...
-
చరిత్ర సృష్టించిన మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ మార్ష్ పొట్టి క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాదిలో 1500 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసీస్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. హండ్రెడ్ 2026లో సన్రైజర...


