IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! | IND vs ZIM 1st T20I: S Badrinath picks India playing 11Leaves out Rinku | Sakshi
Sakshi News home page

IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!.. రింకూకు దక్కని చోటు!

Jul 23 2026 12:42 PM | Updated on Jul 23 2026 1:16 PM

IND vs ZIM 1st T20I: S Badrinath picks India playing 11Leaves out Rinku

జింబాబ్వే కెప్టెన్‌ రజాతో శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI X)

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల  మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదిక. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి ఓపెనర్‌ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్‌ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.

అదే విధంగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్ష్‌ దూబే, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్‌ శర్మ, యశ్‌ ఠాకూర్‌లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్‌ను కూడా తిరిగి పిలిపించింది.

అభిషేక్‌ జోడీగా ఎవరు?
ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్‌ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో వైభవ్‌ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.

అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్‌ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌కు అవకాశం ఉంటుందా?
అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోనే పంజాబ్‌ తరఫున ప్రభ్‌సిమ్రన్‌ ఈ మేరకు రాణించాడు.

నా జట్టు ఇదే
ఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్‌ ఎస్‌. బద్రీనాథ్‌ తన తుదిజట్టులో ఓపెనర్‌గా వైభవ్‌ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, నాలుగో నంబర్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో స్థానంలో వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మను కొనసాగించిన బద్రీనాథ్‌.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్‌ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టాడు.

ఇక స్పిన్‌ విభాగంలో హర్ష్‌ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్‌.. పేస్‌ దళంలో ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌లకు చోటిచ్చాడు.

జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్‌ ఎంచుకున్న జట్టు
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివం దూబే, సూర్యాంశ్‌ షెడ్గే, హర్ష్‌ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌.

చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement