నితేశ్, ప్రజ్ఞయ్‌ సెంచరీలు  | Hyderabad team has a first innings lead of 46 runs | Sakshi
Sakshi News home page

నితేశ్, ప్రజ్ఞయ్‌ సెంచరీలు 

Feb 19 2024 3:45 AM | Updated on Feb 19 2024 3:45 AM

Hyderabad team has a first innings lead of 46 runs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేఘాలయ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఐదు రోజుల ఈ తుది పోరులో రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 25/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు 87.5 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది.

నితేశ్‌ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రజ్ఞయ్‌ రెడ్డి (102 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. నితేశ్‌ అవుటయ్యాక ప్రజ్ఞయ్‌ అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 46 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మేఘాలయ ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండా ఒక వికెట్‌ కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement