కరోనా కాటుకు మాజీ క్రికెటర్‌ బలి

Former Saurashtra Cricketer Rajendrasinh Jadeja Dies Of COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా(66) కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం ఉదయం ఆయన మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ధృవీకరించింది. క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

పాతతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్​రౌండర్‌గా పేరు గాంచిన జడేజా.. 1974-1987 మధ్యకాలంలో 50 ఫస్ట్​క్లాస్​మ్యాచ్‌లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1640 పరుగులతో పాటు 145 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కొంతకాలం పాటు సౌరాష్ట్ర కోచ్‌గా, మేనేజర్‌గా, సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జడేజా.. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా వ్యవహరించాడు. 53 ఫస్ట్​క్లాస్​మ్యాచ్‌లు, 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 34 టీ20 మ్యాచ్‌లకు అతను మ్యాచ్‌ రిఫరీగా పని చేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్​ షా, ప్రస్తుత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్‌ షా సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: ప్రముఖ నటితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడి ప్రేమాయణం..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top