Ranji Trophy: అశ్విన్‌ హెబ్బర్‌ సెంచరీ.. ఆంధ్ర 415 ఆలౌట్‌

Ashwin Hebbar hundred Andhra team all out 415 - Sakshi

సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ (109; 12 ఫోర్లు, 1) సెంచరీ సాధించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 256/5తో బుధవారం ఆట ప్రారంభించిన ఆంధ్ర 415 పరుగుల వద్ద ఆలౌటైంది. లలిత్‌ మోహన్‌ (32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28; 3 ఫోర్లు) అండతో అశ్విన్‌ సెంచరీ చేశాడు.

సౌరాష్ట్ర బౌలర్లలో యువరాజ్‌ సింగ్, ధర్మేంద్రసింగ్‌ జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. షెల్డన్‌ జాక్సన్‌ (63 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఆంధ్ర బౌలర్‌ నితీశ్‌ కుమార్‌ (2/26)... హర్విక్‌ (8), చతేశ్వర్‌ పుజారా (5)లను వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు.
చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top