క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్కు ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. నిన్న (మే 23) పంజాబ్తో జరిగిన మ్యాచ్తో అర్జున్ లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో అతడు బంతితో ఆకట్టుకున్నా, బ్యాటింగ్ సమయంలో సహచరుడి నుంచి ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
లక్నో ఇన్నింగ్స్ చివర్లో (17.6వ ఓవర్) ముకుల్ చౌదరి ఔటైన అనంతరం బ్యాటింగ్కు వచ్చిన అర్జున్కు, ఆ సమయంలో మరో ఎండ్లో ఉన్న అబ్దుల్ సమద్ ఉద్దేశపూర్వకంగా స్ట్రయిక్ ఇవ్వలేదు. అప్పటికే అర్జున్ నిదానంగా ఆడుతున్నాడని భావించిన సమద్.. చివరి ఓవర్లో మూడు బంతులు వృధా చేసి కూడా అర్జున్కు స్ట్రయిక్ ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఈ ఉదంతకం వెంటనే సోషల్మీడియాలో వైరలైంది. సమద్కు స్వార్దపరుడని కొందరు.. కరెక్ట్గానే చేశాడని మరికొందరు అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి అర్జున్కు స్ట్రయిక్ ఇవ్వకపోయినా సమద్ తన పాత్రకు న్యాయం చేశాడు. చివరి ఓవర్ తొలి మూడు బంతులకు పరుగులు సాధించలేకపోయినా, వైడ్లు పక్కకు పెటి, చివరి మూడు అధికారిక బంతులకు 6, 4, 4 పరుగులు చేశాడు. సమద్ అర్జున్కు స్ట్రయిక్ ఇవ్వకపోవడం వల్లనే లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ (196-6) చేయగలిగింది.
అనంతరం ఇన్నింగ్స్ 7వ ఓవర్లో బంతిని అందుకున్న అర్జున్ తొలి ఓవర్లోనే ఆకట్టుకున్నాడు. అప్పటికే మంచి టచ్లో ఉండిన శ్రేయస్, ప్రభ్సిమ్రన్ను కంట్రోల్ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసిన అర్జున్.. భీకర ఫామ్లో ఉన్న ప్రభ్సిమ్రన్ వికెట్ తీసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
శ్రేయస్ సూపర్ శతకం కారణంగా ఈ మ్యాచ్లో లక్నో ఓడినా అర్జున్ ప్రదర్శన మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యాటింగ్ సమయంలో స్ట్రయిక్ దక్కలేదన్న విషయం మినహా వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ అర్జున్కు అన్నీ తీపి గుర్తులే మిగిల్చింది.
ఈ సీజన్లో 13 మ్యాచ్లు బెంచ్కే పరిమితమైన అర్జున్, లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తదుపరి సీజన్కు బాటలు వేసుకున్నాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్తో ఉండిన అర్జున్ను ఈ సీజన్ వేలంలో లక్నో రూ. 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది.


