ప్రజల అవసరాలను గుర్తించి, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా సిద్దిపేట అర్బన్ మండలం ముందుకు సాగుతోంది. ప్రణాళికను పకడ్బందీగా రూపొందించడంలో ప్రజలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం ఎంతగానో తోడ్పడింది. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో మండలం మెరిసేలా కృషి చేస్తాం.
– జోగం రాజు, ఎంపీఓ సిద్దిపేట అర్బన్


