సిద్దిపేటకమాన్: కవులు, రచయితలకు పురస్కారాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆచార్య సంపత్కుమార్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన పెందోట సభలో ఆయన పాల్గొని రచయితలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్యానికి బాలకిషన్ పెట్టని కోట వంటివారన్నారు. పెందోట పురస్కారాలు అందించడం సిద్దిపేట సాహిత్య రంగానికి విశేషమైన విషయమన్నారు. బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పురస్కారాలు అందించినట్లు తెలిపారు. అనంతరం పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘ప్రేరణ కావాలి’ పుస్తకాన్ని ఆవిష్కరించి, కవి సమ్మేళనం నిర్వహించారు. విశ్వతేజ కావ్యశ్రీలకు బాలసాహిత్య పురస్కారాలు, నగదు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో శ్యామల, వెంకటేశం, ఉమారాణి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.


