
నూతనోత్సాహం నింపిన వేడుకలు
● డీఈఓ శ్రీనివాస్రెడ్డి
● ఘనంగా జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం
వర్గల్(గజ్వేల్): ఉన్నత పాఠశాల వార్షిక వేడుకలు అందరిలో నూతనోత్సాహం నింపాయని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించిన స్థానిక జెడ్పీ హైస్కూల్ వార్షి కోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంగ్రా, లంబాడి, హర్యాన, కేరళ నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా వినియోగించుకున్నపుడే అద్భుత ఫలితా లొస్తాయన్నారు. పీఎం శ్రీ పథకం ద్వారా వర్గల్ స్కూల్కు అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వొకేషనల్ కోర్సులు, ఆధునిక వసతులు సమకూరాయని చెప్పారు. పాఠశాల రూపొందించిన ఈ–మేగజైన్, త్రైమాసిక ఆన్లైన్ ప్రగతి పుస్తకం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సునీత, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సూర్యరాజు, అమర్నాథ్, ఏఏపీసీ చైర్మన్ భవాని తదితరులు పాల్గొన్నారు.