విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి

Published Tue, Mar 4 2025 7:11 AM | Last Updated on Tue, Mar 4 2025 7:11 AM

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

దుబ్బాకటౌన్‌: విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం రాయపోల్‌ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదిలో పిల్లల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వినియోగించే కూరగాయలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని భోజన కార్మికులకు సూచించారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement