సంగారెడ్డి: చౌటకూర్లో 50 ట్రాక్టర్లతో తిరంగా ర్యాలీ
సదాశివపేట(సంగారెడ్డి): 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 80 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల వేషధారణలో కనిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ, వైస్ చైర్పర్సన్ రేణుక, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, కృష్ణగౌడ్, పాఠశాల చైర్మన్ నాగనాథ్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


