ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఆనందంలో మునిగితేలారు. రాత్రి పగలు తేడాలేకుండా రెండేళ్లు కష్టపడి చదివారు. మంచి మార్కులు సాధించటం కోసం నిద్రాహారాలు మాని పరీక్షల కోసం సిద్ధమయ్యారు. శుక్రవారం పరీక్షలు ముగియడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరికి ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటర్ తర్వాత ఏం చదువుదామని చర్చించుకున్నారు.ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుని ఇంటికి వెళ్లిపోయారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


