ఐఐటీహెచ్లో సృజనాత్మక కళల కేంద్రం
ప్రారంభించిన డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్లో సృజనాత్మక కళల కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. హెరిటేజ్ టూర్లు, ఫొటోగ్రఫీ, లలిత కళలు, ప్రదర్శన కళలు, హస్తకళల వంటి విభాగాల్లో క్రెడిట్ కోర్సులతో కూడిన నిర్మిత అకడమిక్ ప్రోగ్రామ్గా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ...సృజనాత్మకత, సాంస్కృతిక, సాంకేతికత సమాంతరంగా ఎదగాలన్న ఐఐటీహెచ్ విశ్వాసానికి ఈ కళల కేంద్రం ప్రతీకగా నిలుస్తుందన్నారు.


