యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి

Aug 16 2025 9:00 AM | Updated on Aug 16 2025 9:00 AM

యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి

యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి

హుస్నాబాద్‌: కేంద్ర ప్రభుత్వం యాదవ సైనిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. రెజాంగ్‌లా రాజ్‌ కలశ యాత్ర పది రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తూ శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాదవ సైనిక అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 1962లో భారత, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో మన దేశం తరపున 124 మంది యాదవ సైనికులు పాల్గొని వీరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో 114 మంది యాదవ సైనికులు అమరులయ్యారని తెలిపారు. అమరవీరుల మట్టిని కలశంగా తయారు చేసి దేశ వ్యాప్తంగా వారి త్యాగాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఈ యాత్ర మిగితా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ నవంబర్‌ 18న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ముగింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర బాధ్యులు శ్రీహరి యాదవ్‌, నియోజకవర్గ జేఏసీ కో ఆర్డినేటర్‌ మేకల వీరన్న యాదవ్‌, నాయకులు చందు, బైకని శ్రీనివాస్‌ యాదవ్‌, జక్కుల రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement