
ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కె.మాణిక్రావు ఘనంగా సన్మానించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గురుకుల కళాశాలలకు చెందిన ఐదుగురుకి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశే ఖర రావు దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, అందులో చదివిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంక్లు సాధిస్తున్నారని కొనియాడారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు మోహీయోద్దీన్, తులసీదాస్గుప్త, విజయ్కుమార్, అలీ, జాఫర్ అలీలు పాల్గొన్నారు.