బస్సు నడుపుతుండగా.. డ్రైవర్‌కు గుండెనొప్పి

పటాన్‌చెరు ఆస్పత్రిలో మొయినుద్దీన్‌ - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా, డ్రైవర్‌కు గుండెలో నొప్పిగా అనిపించింది. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను పటాన్‌చెరు బస్టాండ్‌లో దింపాడు. ఆపై కండక్టర్‌ సాయంతో ఆస్పత్రికి వెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేటకు చెందిన మొయినుద్దీన్‌ రాణిగంజ్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాణిగంజ్‌ టు పటాన్‌చెరు బస్సు నడుపుతున్నాడు. మంగళవారం కూడా డ్యూటీలో భాగంగా డిపో నుంచి బయలుదేరాడు. బస్సు ఆర్‌సీపురం వద్దకు రాగానే మొయినుద్దీన్‌కు గుండెనొప్పి ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమై పటాన్‌చెరు బస్టాండ్‌ వరకు ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చాడు. అనంతరం కండక్టర్‌కు చెప్పగా, చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అక్కడ నుంచి తార్మాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top