ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదన్న నేతలకే ఫ్యూచర్ ఉండదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాణాలు తీసే ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనుకుంటే.. ప్రజాప్రభుత్వం దాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ స్థానంలో హైదరాబాద్కు ధీటుగా జిల్లాలో ఫోర్త్ సిటీ నిర్మాణం చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్యూచర్ సిటీ ఉండదని, పెట్టుబడులు పెట్టొదని బెదిరింపు ప్రసంగాలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
శాసనసభలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి


