షాద్నగర్ రూరల్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్ సూచించారు. బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో భగీరథ నీటి సరఫరా, క్వాలిటీ, క్వాంటిటీ, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో మిషన్భగీరథ నీటి సరఫరా ఎలా ఉంది, ఇంటింటికి ఎన్ని రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది, కుళాయిలు ఏ విధంగా పని చేస్తున్నాయనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఏఈఈ అభినవ్, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, అంగన్వాడి టీచర్ రోజా తదితరులు పాల్గొన్నారు.
క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ సునీల్


