యాలాల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృత్యువాత పడింది. ఈ ఘటన మండల పరిధిలోని బెన్నూరులో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గాళ్ల కృష్ణయ్య గేదె మేత మేస్తూ కంచెలేని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగేది కాదని.. గేదె విలువ రూ.లక్ష ఉంటుందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
బొంరెడ్డిపల్లిలో..
కుల్కచర్ల: మండల పరిధిలోని బొంరెడ్డిపల్లిలో విద్యుదాఘాతంతో మృత్యువాతపడింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని రాములు గేదె మేత మేస్తుండగా విద్యుత్ వైర్ తగిలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. గేదె విలువు సూమారు రూ.80వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరారు.


