క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం

Jan 9 2026 11:19 AM | Updated on Jan 9 2026 11:19 AM

క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం

క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం

క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం హుడాకాంప్లెక్స్‌: గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ చాంపియన్‌లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా సీఎంకప్‌–2026ను నిర్వహిస్తోందని తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో గురువారం జ్యోతి ప్రజ్వ లన చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో క్రీడలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వనస్థలిపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శ్రీశైలం జాతీయ రహదారిపై..

తుక్కుగూడ: డివిజన్‌ కేంద్రంలో సీఎంకప్‌ టార్చి రిలేను గురువారం జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్‌ రావు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నా నాయక్‌, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టార్చ్‌ రిలేకు స్వాగతం

అబ్దుల్లాపూర్‌మెట్‌: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైన చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ టార్చ్‌ రిలే హయత్‌నగర్‌ మండలం మీదుగా పెద్దఅంబర్‌పేటలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి, ఎంఈఓ జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement