విద్యార్థులకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్ఫూర్తి

Jun 23 2025 6:59 AM | Updated on Jun 23 2025 6:59 AM

విద్య

విద్యార్థులకు స్ఫూర్తి

సమస్యల పరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య అన్నారు.

8లోu

కేశంపేట: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మే రకు ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ పర్స్యూట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌’ (ఇన్‌స్పైర్‌) పేరుతో ఇన్‌స్పైర్‌ మనక్‌ పురస్కారాలను అందిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి నామినేషన్లు స్వీకరిస్తోంది.

ఎవరు అర్హులంటే..

10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకుల, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్‌ ఉపాధ్యాయుడి గైడ్‌లైన్స్‌ పాటిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

● www.inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్‌ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది.

● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్‌ ఐడీకి యూజర్‌ ఐడీతో కూడిన లింక్‌ వస్తుంది.

● అప్పుడు విద్యార్థులు యూజర్‌ ఐడీకి పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది.

● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.

● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకు రూ.పదివేలు జమ చేస్తారు.

● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు.

● ఆన్‌లైన్‌లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ఎప్పటిలోగా అంటే..

విద్యార్థులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్‌ ఉపాధ్యాయులతో కలిసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

గత విద్యా

సంవత్సరం..

2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయికి 1,881 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 198 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీటి నుంచి నాలుగు జాతీయ స్థాయికి వెళ్లాయి. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా సైన్స్‌ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో అతిథ్యం.. స్వయానా రాష్ట్రపతితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు.. కానీ అందుకోసం విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తమ తెలివికి పదును పెట్టాలి.

జాతీయ స్థాయిలో ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’

స్టూడెంట్స్‌ ఆవిష్కరణలకు ఆహ్వానం

ప్రతిభ చూపినవారికి నగదు పురస్కారాలు

ఆన్‌లైన్‌ ద్వారా సెస్టెంబర్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ

సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్‌ ఎంతగానో దోహదపడుతుంది. ఉపాధ్యా యుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్‌ ఉపాధ్యాయులు కృషి చేయాలి.

– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్‌ అధికారి

విద్యార్థులకు స్ఫూర్తి 1
1/1

విద్యార్థులకు స్ఫూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement