న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట

Nov 27 2023 7:10 AM | Updated on Nov 27 2023 7:10 AM

ఎమ్మెల్యేకు మద్దతు తెలిపి సన్మానిస్తున్న న్యాయవాదులు  - Sakshi

ఎమ్మెల్యేకు మద్దతు తెలిపి సన్మానిస్తున్న న్యాయవాదులు

షాద్‌నగర్‌: న్యాయవాదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో అడ్వకేట్స్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని బీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాదులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఈ ఎన్నికల్లో న్యాయవాదులు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం హర్షనీయమని అన్నారు. బార్‌ అసోసియోషన్‌ అద్యక్షుడు వేణుగోపాల్‌రావు, మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వ్యవస్ధను అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. స్వరాష్ట్రంలో న్యాయవాదులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్‌ రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథ్‌శర్మ, దేశికాచారి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, బాల ప్రసాద్‌, నర్సింలు, విజయ్‌కుమార్‌, నర్సింలు, శేఖర్‌, సురేందర్‌, జయమ్మ, శ్వేత, చంద్రశేఖర్‌ యాదవ్‌, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement