వృద్ధుడు అదృశ్యం

మల్లయ్య (ఫైల్‌) - Sakshi

పహాడీషరీఫ్‌: వృద్ధుడు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన బి.మల్లయ్య (70) క్షౌ రశాలకు గురువారం ఉదయం వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయమై కుటుంబ సభ్యలు అన్ని ప్రాంతాలలో వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో మల్లయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకి తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో కానీ, 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top