కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
సిరిసిల్లటౌన్: డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉత్తరాఖండ్ రామ్లీలా మైదానంలో జరిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల మహాసభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను కించపరచడాన్ని ఖండిస్తూ నిరసనలు చేపట్టారు.
నేత్రవైభవంగా తిరునక్షత్రం
సిరిసిల్లటౌన్: ఆండాళమ్మ తిరునక్షత్ర ఉత్సవంతోపాటు శ్రావణమాసం మొదటి శుక్రవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, విద్యానగర్ భక్తాంజనేయ ఆలయాల్లో తిరునక్షత్ర ఉత్సవాలు కనులపండువగా జరిగాయి.
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో వందలాది సంఖ్యలో కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి, బతుకమ్మ ఘాట్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు.


