
స్వర్ణకారులకు అండగా ఉంటాం
ముస్తాబాద్(సిరిసిల్ల): కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు భరోసా ఇచ్చారు. ముస్తాబాద్లో దీక్షలు చేస్తున్న స్వర్ణకారులకు ఆదివారం సంఘీభావం ప్రకటించారు. శరత్రావు మాట్లాడుతూ ముస్తాబాద్లో ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెల్లరీ దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని, మండలానికి చెందిన స్వర్ణకారులకు న్యాయం చేయాలని కోరారు. కొద్దిరోజులుగా స్వర్ణకారులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక అధికారులు ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, సీపీఎం నాయకుడు మల్లారెడ్డి, గీస భిక్షపతి, మిట్టపల్లి రాజమౌళి, దుబ్బాక సంఘం నాయకులు కాళీదాస్, చారి, బొప్పాపూర్, గొల్లపల్లి సంఘం బాధ్యులు వసంత్కుమార్, బ్రహ్మం, సావిత్రి, సుమతి, జానబాయి సంఘీభావం తెలిపారు.
కార్మికహక్కులు సాధించుకుందాం
సిరిసిల్లటౌన్: కార్మికుల హక్కులను పోరాటా లతో సాధించుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలో ని అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడా రు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే రోజున నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అన్నల్దాస్ గణేశ్, సిరి మల్లె సత్యం, నక్క దేవదాస్, కుమ్మరికుంట కిషన్, బెజిగం సురేష్, బాస శ్రీధర్, ఎక్కలదేవి జగదీశ్, ఎలిగేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తులపై పట్టింపేది?
సిరిసిల్లటౌన్: ప్రజాపాలన దరఖాస్తులపై అధికారుల్లో పట్టింపు కరువైందని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ఆరోపించారు. సిరిసిల్లలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. రేషన్కార్డుల్లో పేర్ల చేర్పులు, మార్పులు కోరుతూ దరఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా స్పందన లేదన్నారు. కొత్తరేషన్కార్డుల ఊసే లేదన్నారు. పౌరసంక్షేమ సమితి సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, సభ్యులు చిప్ప దేవదాసు, వేముల పోశెట్టి తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు ఔట్సో ర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆదివా రం కలెక్టరేట్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిగాయి. మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా పోస్టులను అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ ఉన్నారు.
రేపు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
సిరిసిల్ల: రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా మంగళవారం సిరిసిల్లలో జైబాపు..జై భీమ్.. జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్ నుంచి అంబేడ్కర్చౌరస్తా వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక లహరి గ్రాండ్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్, పీసీసీ ఇన్చార్జీలు హాజరవుతున్నట్లు తెలిపా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

స్వర్ణకారులకు అండగా ఉంటాం

స్వర్ణకారులకు అండగా ఉంటాం