నిధులు మంజూరు చేయాలి
మా గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో భవనం పనులు పూర్తయ్యాయి. లోపల చిన్నపాటి పనులు మిగిలాయి. వాటి కోసం నిధులు మంజూరు చేస్తే పంచాయతీకి పక్కా భవనం అందుబాటులో ఉంటుంది.
– భూక్య తిరుపతినాయక్, సర్పంచ్,
గుంటపల్లిచెరువు తండా
మాది కొత్త గ్రామపంచాయతీ. పంచాయతీ కార్యాలయం కోసం ప్రభుత్వం పక్కా భవనం మంజూరు చేయాలి. తాత్కాలికంగా రేకులషెడ్డులో ఆఫీస్ను పెట్టుకున్నాం. పక్కా భవనం లేక ఇబ్బంది పడుతున్నాం.
– ముడావత్ గణేశ్, జైసేవాలాల్తండా
నిధులు మంజూరు చేయాలి


