
వంతెన పూర్తి చేయండి
● స్తంభంపల్లి నుంచి సిరిసిల్లకు పాదయాత్ర
సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి): అర్ధంతరంగా నిలిచిన స్తంభంపల్లి హైలెవెల్ వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు బుధవారం స్తంభంపల్లిలోని సుగ్రీవ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. మధ్యలో వేములవాడలో రాజన్న, అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయాల్లో దర్శనం చేసుకుని తమ సమస్య పరిష్కారం కావాలని పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కలెక్టరేట్కు రాగా పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ కార్యాలయం ఏవో రామ్రెడ్డి వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి, మాజీ ఉపసర్పంచ్లు బొంగాని అశోక్, బీరవెల్లి వెంకటేశ్వరరావు, ముచ్చె లింగారెడ్డి, తునికి తిరుమలేశ్, రాచర్ల రాజేశ్, అక్కెనపల్లి గణేష్, అక్కెనపల్లి రమేశ్, గొర్రె విజయ్ పాల్గొన్నారు.