● డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
తాళ్లూరు: ఐస్క్రీం వాహనం అదుపుతప్పి డ్రైవర్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తూర్పు గంగవరం రోడ్డు సింగనపాలెం మర్రిచెట్టు సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐస్క్రీం వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ ఎస్డీ జానీ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవ్యక్తి యర్రయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈఎంటీ డీబీ బాలజ్యోతి, పైలట్ సీహెచ్ యోగేశ్వరరావులు సేవలందించారు.


