No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Aug 12 2025 11:09 AM | Updated on Aug 12 2025 11:09 AM

No He

No Headline

సింగరాయకొండ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా లీలా శ్యామ్‌ సుందరి ఇసుక దోపిడీని అరికట్టకుంటే సమ్మె ఏకేయూ బీఎడ్‌ మూడో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల ● రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ హరిబాబు పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీల నియామకం ఒంగోలు సబర్బన్‌: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌)కు త్రిసభ్య కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ అండ్‌ సహకార విభాగానికి చెందిన ఉన్నతాధికారులకు జీఓ ఆర్‌టీ నంబర్‌–669 ఉత్తర్వులను అందజేశారు. అందుకుగాను జిల్లాలోని 46 పీఏసీఎస్‌లకు నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జెస్‌ కమిటీలను నియమించారు. ఒక్కో సొసైటీకి చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరి పదవీ కాలం 2026 జనవరి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అప్పటి వరకుకానీ లేక ఆయా సొసైటీలకు ఎన్నికలు జరిగే వరకు కానీ త్రిసభ్య కమిటీ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఒంగోలు: సింగరాయకొండ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా వి.లీలా శ్యామ్‌ సుందరిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఈమె తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన సింగరాయకొండ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఒంగోలు మొబైల్‌ కోర్టు జడ్జి వి.వెంకటేశ్వరరావు మంగళ, శుక్రవారాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నియామకంతో సింగరాయకొండ జూనియర్‌ సివిల్‌ కోర్టులో కేసుల పరిశీలన వేగవంతం కానుంది.

మార్కాపురం టౌన్‌: మార్కాపురం పట్టణంలో ఇసుక దోపిడీని అరికట్టకపోతే ఈ నెల 16 నుంచి లారీల సమ్మె చేస్తామని, అవసరమైతే తామే వినియోగదారులకు టన్ను ఇసుక రూ.950 లకు అందజేస్తామని మార్కాపురం లారీ అసోసియేషన్‌ నాయకులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్‌ గొట్టిపాటి సురేంద్ర గతంలో తాము తెచ్చే ఇసుకను టన్ను రూ.950లకు కొనుగోలు చేసి వినియోగదారులకు టన్ను రూ.1200 లకు అమ్ముకునే వారని అన్నారు. అయితే ఈ నెల 1న తమను పిలిపించి కేవలం టన్ను ఇసుక రూ.800లకు మాత్రమే విక్రయించాలని సురేంద్ర కోరారని లారీ అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్‌, ఎస్సీ, స్థానిక అధికారులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. వారు స్పందించకపోతే ఈ నెల 16 నుంచి యార్డుకు ఇసుక సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మేమే వినియోగదారులకు ఇసుక టన్ను రూ.950లకు విక్రయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక అని గొప్ప చెబుతున్నారని ఆచరణలో మాత్రం ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారని వినతిపత్రంలో తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు కాశీరాంసింగ్‌, లారీ అసోసియేషన్‌ నాయకులు ఉన్నారు.

ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్‌ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి సూచనల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,955 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 94.37 శాతంతో 10,339 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ ఉప కులపతి ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు అభినందించారు. మూడో సెమిస్టర్‌ ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్‌ సోమశేఖర, పీజీ కో ఆర్డినేటర్‌ (నాన్‌ కాన్ఫిడెన్షియల్‌ ) డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరామ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No Headline1
1/1

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement