
జీతాలివ్వండి మహాప్రభో!
మార్కాపురం: నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో జీజీహెచ్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చెల్లించాలని సీఐటీయూ కార్యదర్శి డీకేఎం రఫీ డిమాండ్ చేశారు. జీజీహెచ్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కు మద్దతుగా సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయం, జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీజీహెచ్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కు పెండింగులో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా నెల నెలా చెల్లించకుంటే వారెలా బతకాలని ప్రశ్నించారు. వేతనాలు చెల్లించకుండా కార్మికులచేత పనిచేయిస్తున్న విజయవాడకు చెందిన ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల వేతనాల నుంచి పీఎఫ్ పేరుతో డబ్బులు కట్చేస్తూ వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం లేదని అన్నారు. జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాల పోషించుకోలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగులో ఉన్న జీతాలను చెల్లించి పీఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుబ్బరాయుడు, శివారెడ్డి, సుబ్రహ్మణ్యం, రూబెన్, రాజు, స్వప్న, కొండమ్మ, మల్లిఖార్జున, నూర్జహాన్, మీరాంబి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వని కూటమి ప్రభుత్వం సబ్కలెక్టర్ కార్యాలయం, జీజీహెచ్ ఎదుట వర్కర్స్ ధర్నా