రహదారులు రక్తసిక్తం | - | Sakshi
Sakshi News home page

రహదారులు రక్తసిక్తం

Apr 26 2025 1:15 AM | Updated on Apr 26 2025 1:15 AM

రహదార

రహదారులు రక్తసిక్తం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ఏడుగురికి గాయాలు

కారు అదుపుతప్పి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అర్థవీడు మండలం చర్లోదొనకొండకు చెందిన చందా వెంకట రవీంద్రారెడ్డి (39) చెన్త్నెలో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ తిరుపతిలో స్థిరపడ్డాడు. భార్య లక్ష్మి, కుమార్తె అక్షరతో కలిసి కారులో తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. పెంచికలపాడు వద్ద గేదెను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి హైవే కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రవీంద్రారెడ్డి తీవ్రంగా గాయపడి స్టీరింగ్‌ వద్ద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కారులో నుంచి రవీంద్రారెడ్డిని బయటకు తీశారు. కారు నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రహదారులు రక్తసిక్తం1
1/3

రహదారులు రక్తసిక్తం

రహదారులు రక్తసిక్తం2
2/3

రహదారులు రక్తసిక్తం

రహదారులు రక్తసిక్తం3
3/3

రహదారులు రక్తసిక్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement