
ఉగ్ర దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
ఒంగోలు సిటీ: జమ్ము కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఒంగోలులోని బాపూజీ మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో బుధవారం నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. ఇది చాలా హేయమైన ఘటన అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాశ్మీరు చాలా సుందరమైన ప్రదేశమని, టూరిస్ట్లు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ చనిపోయిన మృతులకు నివాళులర్పిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. భారతదేశపు ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని పొరుగుదేశానికి చెందిన టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణంలో కాశ్మీరు అభివృద్ధి చెందుతుంటే పొరుగు దేశం చిచ్చుపెడుతోందన్నారు. భారతదేశం మొత్తం ఐక్యంగా ఉంటుందని, ప్రపంచానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా అధ్యక్షులు దుంపా రమణమ్మ, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు పేరం ప్రసన్న, ఎస్.రమణమ్మ, సాధం విజయలక్ష్మి, వి.వాణి, గాయం సావిత్రిదేవి, మేరీకుమారి, పిగిలి శ్రీను, ఆనం శ్రీనివాసరెడ్డి, ఎస్.వెంగారెడ్డి, చింతా సతీష్రెడ్డి, దుంపా చెంచిరెడ్డి, హోసింగ్బోర్డు చిన్న, కె.స్వామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.