చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ | Ysrcp Mlc Mondithoka Arun Kumar Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌

Apr 17 2025 4:05 PM | Updated on Apr 17 2025 4:43 PM

Ysrcp Mlc Mondithoka Arun Kumar Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.

‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే‌ పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్‌కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

MLC Arun Kumar: కూటమి ప్రభుత్వంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తీవ్రమైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement