‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’ | YSRCP Leader Putta Shiva Shankar Demands Action Against Lokesh | Sakshi
Sakshi News home page

‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’

Jun 2 2025 3:40 PM | Updated on Jun 2 2025 7:29 PM

YSRCP Leader Putta Shiva Shankar Demands Action Against Lokesh

తాడేపల్లి : మంత్రి నారా లోకేష్‌ టెన్త్‌ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పడమే కాకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల దిద్దుబాటులో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు.  

ఈరోజు(సోమవారం, జూన్‌ 2) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్‌..  ‘ జరిగిన తప​ఉకు అంగీకరించకపోగా ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. పదో తరగతి విద్యార్తుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మార్కులు తక్కువ వేసి వేలాది మంది విద్యార్థులను ఫెయిల్‌ చేశారు. 

రీవెరిఫికేషన్‌ చేయిస్తే ఎంతోమందికి మంచి మార్కులు వచ్చాయి. టెన్త్‌ క్లాస్‌ అనేది పిల్లలకు సున్నితమైన దశ.  అలాంటి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రికార్డుల కోసం వారం రోజుల్లోనే పేపర్లు దిద్దాలని చూశారు. కనీసం టీచర్లు సంఖ్యను కూడా పంచకుండా పేపర్లు దిద్దించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. రీవెరిఫికేషన్‌ కు తీసుకున్న రూ. 6 కోట్ల ఫీజను వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తప్పించుకోవాలని చూస్తే సహించలేదు’ అని హెచ్చరించారు. 

Putha Siva Sankar: తక్షణమే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement