ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు | Two Leaders Placed In Congress Election Screening Committee | Sakshi
Sakshi News home page

ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు

Sep 20 2023 9:01 PM | Updated on Sep 20 2023 9:11 PM

Two Leaders Placed In Congress Election Screening Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం దక్కింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లకు చోటు కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఎంపీ మురళీధరన్ అధ్యక్షతన సభ్యులుగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.  తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కి లకు అందులో స్థానం లభించింది. 

ఇదీ చదవండి: ఆసక్తికరంగా సెకండ్‌ లిస్ట్‌.. భారం దించుకోనున్న స్క్రీనింగ్‌ కమిటీ! ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే!

Advertisement
 
Advertisement
Advertisement