breaking news
placed
-
ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్ నేతలకు స్థానం దక్కింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్లకు చోటు కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ మురళీధరన్ అధ్యక్షతన సభ్యులుగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కి లకు అందులో స్థానం లభించింది. ఇదీ చదవండి: ఆసక్తికరంగా సెకండ్ లిస్ట్.. భారం దించుకోనున్న స్క్రీనింగ్ కమిటీ! ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే! -
త్వరలో భారీగా ఎస్ఐల బదిలీలు
ఖమ్మం క్రైం: త్వరలో భారీగా ఎస్ఐల బదిలీలు జరుగనున్నాయి. కృష్ణా పుష్కరాల అనంతరం ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ప్రొబిషనరీ కాలం పూర్తి చేసిన ఎస్ఐలకు ఈ బదిలీలో పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. మంచి పోస్టింగ్ల కోసం ఇప్పటి నుంచే ఎస్ఐలు జిల్లాలో ఉన్న అధికార పార్టీల నాయకుల చుట్టు కొంతమంది ఎస్ఐలు తిరుగుతుండగా, మరికొంతమంది కులం పేరుతో అ«ధికార పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం. మంచి పోస్టులో ఉన్న కొంతమంది ఎస్ఐలు తాము పనిచేస్తున్న చోటు నుంచి కదలకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.