మోదీ మాటలు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది: హరీశ్‌రావు | Telangana Minister Harish Rao Fires On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

తెలంగాణపై బురదజల్లడమే మోదీ పని.. మోటార్లకు మీటర్లు పెట్టలేదని రూ.30వేల కోట్లు ఆపారు: హరీశ్‌రావు

Apr 9 2023 4:50 PM | Updated on Apr 9 2023 5:00 PM

Telangana Minister Harish Rao Fires On PM Narendra Modi - Sakshi

సిద్ధిపేట: రాఘవాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరంతో తమకు పండగని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్దఎత్తున పంటలు పండుతున్నాయని చెప్పారు.

కానీ ప్రధాని మోదీకి ఎంతసేపూ తెలంగాణపై బురదజల్లడమే పని అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌ సభలో మోదీ మాట్లాడిన మాటలు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు.

వరంగల్‌ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ఆపారని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని రూ.30వేల కోట్ల నిధులు ఆపారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.
చదవండి: ఎన్నికల కోసమే ఆయుధంగా వాడుతున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement