ఈ సీటు రూటే సపరేటు! | shravasti lok sabha seat uttar pradesh | Sakshi
Sakshi News home page

Shravasti: ఈ సీటు రూటే సపరేటు!

Mar 25 2024 2:57 PM | Updated on Mar 25 2024 3:08 PM

shravasti lok sabha seat uttar pradesh - Sakshi

లోక్‌సభ ఎ‍న్నికల సమరానికి ఇంక కొన్ని రోజులే మిగిలిఉన్నాయి. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యం ఉన్న సీట్లు చాలానే ఉన్నాయి. చాలా చోట్ల వరుసగా రెండు మూడు సార్లు నెగ్గిన అభ్యర్థులు ఉన్నారు. అయితే శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం ఓటర్ల తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు జ‌రిగిన లోక్ సభ ఎన్నిక‌ల‌ను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల తర్వాత ఎంపీలు మారిపోతున్నారు. కొత్త డీలిమిటేషన్ తర్వాత జరిగిన మొత్తం మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ క్యాంపుల నుంచి అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇక నాలుగోసారి అంటే ఈ సారి ఎన్నిక‌ల్లో ఎంపీ ఎవరవుతార‌న్న చర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ను వేడెక్కిస్తోంది.

శ్రావస్తి జిల్లాలోని భింగా, శ్రావస్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, బలరాంపూర్ జిల్లాలోని తులసిపూర్, బల్రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గాలు, గస్డి ప్రాంతం కలిపి 2009 సంవత్సరంలో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. డీలిమిటేషన్ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు తలపడ్డారు. కాంగ్రెస్‌ తరఫున వినయ్‌కుమార్‌ పాండే అలియాస్‌ బిన్నూ, బీఎస్‌పీ నుంచి రిజ్వాన్‌ జహీర్‌, ఎస్పీ నుంచి రుబాబ్‌ సయీదా, బీజేపీ నుంచి సత్యదేవ్‌ సింగ్‌ బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 2,01,556 ఓట్లు రాగా బీఎస్పీ అభ్యర్థిపై 42,029 ఓట్లతో విజయం సాధించారు. ఎస్పీకి మూడో స్థానం, బీజేపీకి నాలుగో స్థానం దక్కాయి.

2014 ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ తరపున దద్దన్ మిశ్రా, ఎస్పీ అతీక్ అహ్మద్, బీఎస్పీ నుంచి లాల్జీ వర్మ, కాంగ్రెస్ నుంచి వినయ్ కుమార్ పాండే అలియాస్ బిన్నూ రెండోసారి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో రిజ్వాన్ జహీర్ పీస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అతిక్ అహ్మద్ 85 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి దద్దన్ మిశ్రా 85,913 ఓట్లతో విజయం సాధించారు. ఈయనకు 3,45,964 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ రెండో స్థానంలో, బీఎస్పీ మూడో స్థానంలో, పీస్ పార్టీ నాలుగో స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఇక మూడోసారి ఎన్నికలు 2019లో జరిగాయి.ఈసారి ఎస్పీ-బీఎస్పీ పొత్తు తర్వాత ఈ సీటు బీఎస్పీ శిబిరానికి దక్కింది. ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీఎస్పీ కూటమి రామ్ శిరోమణి వర్మను అభ్యర్థిగా చేసింది. బీజేపీ నుంచి దద్దన్ మిశ్రా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ తన రూపు మార్చుకుని ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థి బీజేపీపై 5,320 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఈసారి నాలుగో ఎన్నికల ప్రకటన వెలువడింది. బీజేపీ తన అభ్యర్థిగా ఎమ్మెల్సీ సాకేత్ మిశ్రాను ప్రకటించింది. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు తర్వాత ఈ సీటు ఎస్పీకి దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులు ఎవరు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరనే దానిపై ఇటు ఓటర్లు, అటు రాజకీయ పరిశీలకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement