బీజేపీ తొలి జాబితా.. శివరాజ్ చౌహాన్‌కు చోటు, ప్రగ్యా ఠాకూర్‌పై వేటు | Shivraj Chouhan In BJP Madhya Pradesh List And Pragya Thakur Dropped, Know Details Inside - Sakshi
Sakshi News home page

బీజేపీ తొలి జాబితా.. శివరాజ్ చౌహాన్‌కు చోటు, ప్రగ్యా ఠాకూర్‌పై వేటు

Mar 3 2024 5:03 PM | Updated on Mar 4 2024 3:22 PM

Shivraj Chouhan In BJP Madhya Pradesh List And Pragya Thakur Dropped Details - Sakshi

గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్న 'శివరాజ్ సింగ్ చౌహాన్'కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో స్థానం కల్పించింది. దీంతో ఈయన మధ్యప్రదేశ్‌లోని విదిషా నుంచి పోటీ చేయనున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన ఘనత చౌహాన్‌దే.

లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా, జాబితాలో చోటు సంపాదించిన పేర్లు మాత్రమే కాకుండా.. లోపాలు ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఫైర్‌బ్రాండ్ లీడర్ ప్రగ్యా ఠాకూర్ ఉన్నారు.

భోపాల్‌లో బీజేపీ ప్రగ్యా ఠాకూర్ స్థానంలో అలోక్ శర్మను ఎంపిక చేసింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొనడం మాత్రమే కాకుండా 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్‌ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ కారణంగానే లోక్‌సభ సీటు ఇవ్వలేదు.

ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్ప మరెవరూ స్పందించలేదు. ఆ సమయంలో క్షమాపణలు కోరినప్పటికీ.. నేను పూర్తిగా క్షమించలేనని మోదీ ఖరాకండిగా వెల్లడించారు. 2008 ఉగ్రదాడుల సమయంలో మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై వారు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement