ఆ విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ శాసన మండలిలో సైందవ పాత్ర పోషించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'శాసనసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే అవుతుంది. స్థానిక సంస్థల కోటాలో ​కూడా 11 మంది పేర్లు ప్రకటించాం. దీంతో శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 32 మందికి పెరుగుతుంది. 18 మంది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించామని సగర్వంగా ప్రకటిస్తున్నాం. అందులో నలుగురు మైనార్టీలు. టీడీపీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఆ పార్టీని ప్రజా కోర్టులో ప్రజలు తిరస్కరించారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో బలహీన వర్గాలకు 50 శాతం కేటాయించాం. సోషల్‌ ఇంజనీరింగ్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top