Rayapati Sambasiva Rao Comments On Kanna Lakshminarayana - Sakshi
Sakshi News home page

కన్నాను ఓడించడం గ్యారెంటీ.. నన్ను, బాబును ఎన్ని మాటలు అన్నారో!

Feb 23 2023 5:12 AM | Updated on Feb 23 2023 11:55 AM

Rayapati Sambasiva rao comments on Kanna Lakshminarayana  - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓ­డించడం గ్యారెంటీ. ఆయన్ని టీడీపీలోకి తీసు­కో­వ­డం చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదు. క­న్నా­ను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీని­యర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీని­యర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశి­వరా­వు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకా­లం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రా­జుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవ­హరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ, జనసేనలో చేరతారనే ఊహాగానాలకు తె­ర­దించుతూ గురువారం ఆయన సైకిల్‌ ఎక్క­ను­న్నా­రు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘నేను చాలా అసంతృప్తితో ఉన్నా. కన్నాను పార్టీలో చేర్చుకోవడం పెద్ద తె­లివి తక్కువ పని. నన్ను, చంద్రబాబును కన్నా ఎన్నేసి మాటలు అన్నాడు. పందులు, కుక్కలు, న­క్క­లు అంటూ వ్యక్తిగతంగా, సా­మా­జికవర్గాన్ని దు­మ్మె­­త్తిపోశాడు.

అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఏమిటి’ అంటూ ఆగ్రహం వ్య­క్తం చే­శారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవస­ర­మ­ని చం­ద్ర­బాబు చెబుతున్నారు. అయినా ఆయ­న్ను చూసి ఏమిటి భయపడేది? అతనికి ఎన్ని  ఓట్లు వ­­సా­్తయి. నేను గుంటూరు లోక్‌సభ స్థానానికి, ఆ­య­­న పె­ద­కూరపాడు అసెంబ్లీకి పోటీచేసినప్పుడు నా­లు­గైదు వేల ఓట్లు  మెజార్టీ నాకే వచ్చేవి. నరస­రా­వుపే­ట­లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓ­ట్లెన్ని వ­చ్చా­­యో అందరికీ తెలిసిందే’ అంటూ ఎద్దేవా­చేశా­రు.

ఏమాత్రం మంచి పద్దతి కాదు
‘పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు. అందరి ముడ్డి కిందకు తెస్తున్నారు. అలా చేయడం తప్పు, అన్యాయం. ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు? ఇలాగైతే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను. ఎందుకు వెళ్లాలి? పార్టీలో మాకు టికెట్‌ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. 

నన్ను మాట్లాడవద్దన్నారు
‘చంద్రబాబు ఫోన్‌ చేశారు. కన్నాను తీసుకుంటు­న్నా­ం. నీతో పర్సనల్‌గా మాట్లాడతానన్నారు. అదే­వి­ధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫో­న్‌ చేసి సార్‌ హైదరాబాద్‌ వెళ్లారు. వచ్చాక మీతో మా­ట్లాడతారు. అప్పటివరకు కన్నా గురించి ఎవ­రితోనూ మాట్లాడవద్దు. స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పారు. పార్టీలో కన్నా చేరుతున్నారని ఆఫీసు నుంచి ఎవరో ఫోన్‌చేశారు. నేను రావడంలేదన్నాను. నేను వెళ్లను కూడా’ అని రాయపాటి చెప్పారు.

12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు
‘కన్నా నాపై 2010లో పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు. రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నవంబరు రెండో తేదీ న్యాయమూర్తి ద్వారా రాజీ చేసుకు­న్నారు. టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చు­కున్నట్లు ఉంది. చంద్రబాబుపైనా అనేక కేసులు వేశారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కన్నాను పార్టీలోకి తీసుకోవడమే విచిత్రం’ అని రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement