ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారు: ఈటల
సాక్షి, కరీంనగర్: ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..హుజూరాబాద్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, రంగనాయకసాగర్లో బేరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆర్డీవో నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారుంటూ ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్..
టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి ఈటల ప్రయత్నించారని, అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టాలని చూశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్లో అభివృద్ధి జరుగుతోందని ఆయనన్నారు.