సాక్షి, అమరావతి: ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ ఉత్తరం రాస్తే దాన్ని తప్పుపట్టిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని సీఎస్కు లేఖ రాశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ నిలదీశారు. ఒక ఆధారం అయినా ఇవ్వండి అని డీజీపీ అడిగితే, అడగటానికి డీజీపీ ఎవరు అని ప్రశ్నించారని తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► ఎటువంటి ఆధారం, సమాచారం లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలి. ఒక పత్రిక పిచ్చి రాతలు రాస్తే.. దాన్ని పట్టుకుని ప్రధానికి లేఖ రాయటం చూస్తుంటే చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవం ఏమైందనే అనుమానం కలుగుతోంది. అసలు ఆయన బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడేనా?
► బాధ్యతగల సామాన్య పౌరులే ఆధారాలు చూపుతారు. అలాంటిది ప్రతిపక్ష నేతగా, రాజకీయాల్లో ఎంతో సీనియర్ అని చెప్పుకునే బాబుకు సామాన్య పౌరుడికి ఉన్న జ్ఞానం కూడా లేకపోవటం ఆశ్చర్యం.
► సైనికుల్లా పని చేస్తున్న 4 లక్షల మంది వలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బందిని కించపరిచేలా మాట్లాడుతున్న లోకేష్ను చంద్రబాబు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలిపించుకోలేరు. వార్డు మెంబర్గా లోకేష్ను పోటీ చేయిస్తే, వలంటీర్ను పెట్టి గెలిపించుకుంటాం. ఈ సవాల్ను బాబు స్వీకరించాలి. ఇటువంటి లోకేష్ను చంద్రబాబు నాలుగు శాఖలకు మంత్రిని, టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు.
► చంద్రబాబు శిఖండిలా అడ్డుపడినా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. చంద్ర విఘ్నాలను అధిగమిస్తాం. గత ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టినా బాబుకు జ్ఞానం రాలేదు.
► భూముల్లో ఆవగింజంత అవినీతి కూడా జరగలేదు. అవినీతి గురించి బాబు మాట్లాడటం సిగ్గుచేటు. స్కాం బాబు అంటే నారా బాబు. ఏటీఎం బాబు, సూట్ కేసు బాబు అంటే లోకేష్ బాబే. జూమ్ మీటింగ్లకు తప్ప బాబు ఏపీకి పనికి రాడు అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.
ఏ మొహం పెట్టుకొని సీఎస్కు లేఖ రాశావ్
Published Sat, Aug 22 2020 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు
బీసీలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
పోస్టల్ బ్యాలెట్లకు 7, 8 తేదీల్లో మరో అవకాశం
టీడీపీ కార్యకర్త దాష్టీకం
7, 8 తేదీల్లోనూ పోస్టల్ ఓటు వేసే అవకాశం
తరలిరండి
కొలువుల జాతర
No Headline
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement