
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల అంకం పూర్తయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి సత్తా చాటిన అధికార టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లోనూ 100కు పైగా స్థానాలపై గురిపెట్టింది. మరోసారి ఎంఐఎంతో జట్టుకట్టి మేయర్ పీఠంపై కన్నేసింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ కారు పార్టీకి షాకిచ్చింది. దీంతో గ్రేటర్ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ మరింత శ్రద్ధ తీసుకుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. పనితీరు సరిగా లేని 26 మంది సిట్టింగ్లను పోటీ నుంచి తప్పించింది. ఇక బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 69 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి