Huzurabad Bypoll 2021:Etela Jamuna Nomination Withdrawal - Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll: ఈటల జమున నామినేషన్‌ విత్‌ డ్రా

Published Wed, Oct 13 2021 2:17 PM

Etela Jamuna Nomination Withdrawal In Huzurabad Bypoll 2021 - Sakshi

సాక్షి, కరీంనగర్:  హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా  చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్‌ సతీమణి ఈటల జమున, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు.

చదవండి: Huzurabad Bypoll: బజాజ్‌ చేతక్‌ స్కూటర్లంటే సెంటిమెంట్‌ ‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?

ఇంకా బరిలో 39మంది అభ్యర్థులు 31మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 15మంది అభ్యర్థులు, 1నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement