Dalit Organizations Stopped TDP Lokesh Yuvagalam Padayatra In Nandyal District - Sakshi
Sakshi News home page

లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న దళిత సంఘాలు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

Apr 15 2023 11:10 AM | Updated on Apr 15 2023 1:22 PM

Dalit Organizations Stopped TDP Lokesh Padayatra - Sakshi

సాక్షి, కర్నూలు: నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దళిత సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోకేష్ ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేసుకున్నాడు.

కాగా.. దళితులపై నారా లోకేశ్‌ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తు­న్న పాదయాత్రలో లోకేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నా­యి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యా­ల జిల్లా డోన్‌ నియోజకవర్గానికి లోకేశ్‌ చే­రుకున్నారు. జక్కసానిపల్లి­లో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే దళితులు పీకిందేమీ  లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చదవండి: Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement