సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్‌ భావోద్వేగం

Cm Kcr Speech At Siddipet Public Meeting - Sakshi

సాక్షి, సిద్ధిపేట: జన్మభూమిని మించిన స్వర్గం లేదని.. సిద్ధిపేట గడ్డ తనను నాయకుడ్ని చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన సిద్ధిపేటలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సిద్ధిపేట తనను తెలంగాణకు ముఖ్యమంత్రికి చేసిందని, సిద్ధిపేట రుణం జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. ‘‘సిద్ధిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉంది. సిద్ధిపేటలో నేను తిరగని పల్లె, ప్రాంతం లేదు. ‘‘చింతమడకలో నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది’’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘సిద్ధిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికే ఆదర్శం. సిద్ధిపేటను హరీష్‌రావు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. సిద్ధిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. తెలంగాణలోనే సిద్ధిపేట వజ్రం తునుకలా తయారవుతోంది. ఆరు అడుగుల బుల్లెట్‌ హరీష్‌రావు సిద్ధిపేటకు అప్పగించా’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: కేటీఆర్‌కు కాంగ్రాట్స్‌.. తనయుడిని పొగిడిన కేసీఆర్‌ 

మంత్రి హరీష్‌రావు భావోద్వేగం..
ఈ రోజు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ దివెనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్వాస ఉన్నంత కాలం, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కి, సిద్దిపేట జనాలకే నా జీవితం అంకితం చేస్తాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కట్టించిన తక్కువే. నా చివరి శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీకు సేవ చేస్తాను’’ అంటూ హరీష్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ ఘనత కేసీఆర్‌దే..
ఇది ఎన్నికల ప్రచార సభలా లేదని, మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్. ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. సిద్ధిపేటకి కాళేశ్వరం నీళ్లు వస్తాయంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే.. రైతుల బాధలు ఆయనకు తెలుసు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

రోడ్డు పక్కన హోటల్‌లో చాయ్‌ తాగిన సీఎం కేసీఆర్‌
సిద్దిపేట సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్‌ కాసేపు సేద తీరారు. మార్గంమధ్యలో సోనీ ఫ్యామిలీ దాబా వద్ద కాసేపు ఆగి చాయ్‌ తాగారు. ఆయనతో పాటు, మంత్రి హరీష్‌రావు, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2023
Nov 10, 2023, 06:25 IST
మధిర/సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని...
10-11-2023
Nov 10, 2023, 06:16 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు...
10-11-2023
Nov 10, 2023, 05:50 IST
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం...
10-11-2023
Nov 10, 2023, 05:46 IST
సిరిసిల్ల/ కొడంగల్‌: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్‌ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక...
10-11-2023
Nov 10, 2023, 05:40 IST
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం,...
10-11-2023
Nov 10, 2023, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల చివరి,...
10-11-2023
Nov 10, 2023, 05:05 IST
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది....
10-11-2023
Nov 10, 2023, 04:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని కాంగ్రెస్‌...
10-11-2023
Nov 10, 2023, 04:37 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో...
10-11-2023
Nov 10, 2023, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల...
10-11-2023
Nov 10, 2023, 04:15 IST
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్‌: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌...
09-11-2023
Nov 09, 2023, 16:38 IST
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు.. 
09-11-2023
Nov 09, 2023, 15:40 IST
కామారెడ్డికి కేసీఆర్‌ ఒక్కడే రాడని.. కేసీఆర్‌ వెంట చాలా వస్తాయని బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో.. 
09-11-2023
Nov 09, 2023, 13:15 IST
కథలాపూర్‌ (వేములవాడ): ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజం. ప్రజాప్రతినిధులకు మాత్రం పదోన్నతులు ఉండవు. కానీ కథలాపూర్‌ జెడ్పీటీసీలుగా పదవీ బాధ్యతలు...
09-11-2023
Nov 09, 2023, 12:40 IST
సాక్షి, వరంగల్‌: జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నవంబర్‌ 30న ఎన్నికలు ఉండడంతో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు...
09-11-2023
Nov 09, 2023, 11:28 IST
నల్లగొండ: జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల...
09-11-2023
Nov 09, 2023, 11:13 IST
హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి....
09-11-2023
Nov 09, 2023, 10:08 IST
హైదరాబాద్:  మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741...
09-11-2023
Nov 09, 2023, 09:48 IST
సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది....
09-11-2023
Nov 09, 2023, 08:40 IST
మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,...



 

Read also in:
Back to Top