ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్‌ ఆకస్మిక సమావేశం | Sakshi
Sakshi News home page

మంత్రులతో సీఎం కేసీఆర్‌ ఆకస్మిక భేటీ..

Published Sat, Mar 19 2022 1:10 PM

CM KCR Emergency Meeting At Erravalli Farm House - Sakshi

సాక్షి, సిద్ధిపేట(మెదక్‌): ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్‌ శనివారం అకస్మిక భేటీ ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి సీఎస్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సబితా ఇద్రారెడ్డి, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కవిత హాజరైనట్లు తెలుస్తోంది.

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఈ భేటీలో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదల, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు, వైఖరిపై సమీక్షించనున్నట్లు సమాచారం.
చదవండి: బీజేపీ ‘ముందస్తు’ వ్యూహం!

Advertisement
Advertisement