ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్‌ ట్వీట్‌ | Cm Cpro Counter Tweet To Ias Smita Sabharwal | Sakshi
Sakshi News home page

ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్‌ ట్వీట్‌

Apr 19 2025 7:36 PM | Updated on Apr 19 2025 8:10 PM

Cm Cpro Counter Tweet To Ias Smita Sabharwal

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి ఘటనలో తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై  సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్‌ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్‌ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. అప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?.. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్‌ చేశారు.

కాగా, స్మితా సబర్మాల్‌ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆపై తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.

‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. హాయ్‌ హైదరాబాద్‌ పోస్టును రీట్వీట్‌ చేశా.  2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్‌ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?.  అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్‌ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్‌?. జస్టిస్‌ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా?’’ అని ట్వీట్‌ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement