
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది.
సాక్షి, విజయవాడ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది. ఏకంగా రూ.4.28 కోట్లు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభను చంద్రబాబు సర్కార్ నిర్వహించింది.
అయితే, సభను నిర్వహణ ఖర్చు 4.28 కోట్లు రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీగా ఖర్చు చేశారా అంటూ ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వ్యాపార వేత్త సంస్మరణ సభకు రూ.4 కోట్లుపైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై చర్చ కూడా జరుగుతోంది.

ఇదీ చదవండి: ఇది సరైన సందేశమేనా?